Sunday, December 12, 2010

ఆవునెయ్యి ఉపయోగాలేమిటి? ఆవునెయ్యి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందా?

Sunday, December 12, 2010



ఆవునెయ్యి ఆరోగ్యానికి ఉపయోగకరమనీ, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుందనీ ప్రయోగపూర్వకంగా నిరూపితమైంది.  దీపారాధన చెయ్యటానికీ, యజ్ఞయాగాలకూ ఆవునెయ్యిని వినియోగిస్తారు.  ఆవునెయ్యితో వెలిగించిన దీపం వున్న గదిలో వున్నవారిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  యజ్ఞయాగాదులలో ఆహుతి చేసిన ఆవునెయ్యి నుంచి వచ్చిన ఆవిరి ఆకాశంలో 7, 8 కి.మీ. ఎత్తుకి వెళ్ళి వర్షాలు పడతాయని రష్యా శాస్త్రవేత్తలు పరిశోధన చేసి కనిపెట్టారు.  మనవాళ్ళు కృత్రిమ వర్షాలు కురిపించటానికి మేఘమధనానికి వాడే కెమికల్స్ వల్ల కురిసే వర్షాలలో నీరుకూడా కాలుష్యమయమై వుంటుంది.

పురాణాలలో కధ ప్రకారంకూడా గాంధారి గర్భపాతం చేసుకున్నప్పుడు ఆ అండాన్ని కుండలలో ఆవునెయ్యిలో భద్రపరిచారుట.  ఆయుర్వేదంలో ఎన్నో మందులలో ఆవునెయ్యి కలుపుతారు.  ఘృతం అంటారు ఆవునెయ్యిని.  ఆవునెయ్యికి కొన్ని ఏళ్ళవరకు భద్రపరిచే గుణం వుంది.


ఆరోగ్యానికి కూడా ఆవునెయ్యి మంచిది.  ఈ మధ్య ఆరోగ్యంకోసమని చాలామంది నెయ్యి, నూనె తినటం మానేస్తున్నారు.  కానీ ఆవునెయ్యి తినటంవల్ల కొలెస్ట్రాల్  నియంత్రణలో వుంటుంది.  రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.  అల్సర్స్ నయమవుతాయి.  జీర్ణక్రియని ఉత్తేజపరిచి జీర్ణకోశాన్ని కాపాడుతుంది.   శరీరంలో దోషాల్ని కొట్టేసి  కురుపులు రాకుండాఆరోగ్యాన్ని కాపాడుతుంది.  అందుకే రోజూ ఆహారంలో నియమిత రూపంలో ఆవునెయ్యి వాడాలి.

ఆవునెయ్యి మేధస్సును పదునుపరుస్తుంది.  కళ్ళకి మంచి చేస్తుంది.  మనసును ప్రశాంతంగా వుంచుతుంది.  జీర్ణక్రియను బాగుపరుస్తుంది.  అందుకే మిగతా నూనెలు మానేసినా రోజూ రెండు చెంచాలు ఆవునెయ్యిని ఆహారంతో తీసుకుంటే ఎన్నో రోగాలనుంచి దూరంగా వుండవచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




0 comments: