Thursday, October 29, 2009

రోబోలు

Thursday, October 29, 2009
మన పూర్వీకులు రోబోల గురించి చెప్పారా?

అవునంటే అశ్చర్యపోతారా? 11వ శతాబ్దంలో భోజరాజు తన సమరాంగణ సూత్రధార అనే వాస్తు శాస్త్రంలో విచిత్రమైన యంత్రాలు, నవ్వే బొమ్మలు, మాట్లాడే బొమ్మల గురించి చెప్పాడు. ఇలాంటి బొమ్మలని ఎక్కువగా ద్వారపాలకులుగా ఉపయోగించేవాళ్ళు. ఏదైనా కొత్త శబ్దం వినబడితే వెంటనే అటువైపు వచ్చే దానిని దేనినైనా నరికేసేవి ఆ బొమ్మలు. ఫలహారాలనీ, నీళ్ళనీ అందించటానికి కూడా ఉపయోగించేవాళ్ళు.

శాస్త్రాల్లో చెప్పని విషయం ఏమీ లేదు. ఇప్పుడు కనుక్కున్న వాటికన్నా ఎన్నో ఎక్కువ విషయాలను సూక్ష్మాతి సూక్ష్మంగా ఏ వస్తువుని ఎలాంటి వాతావరణంలో ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాలి అని అనేక శతాబ్దాల క్రితమే మన శాస్త్రాల్లో లిఖించబడివుంది.



సూక్ష్మదర్శిని


సప్త ఋషులలో ఒకరైన గౌతమ మహర్షి గాజు, అభ్రకము, స్ఫటికము ఉపయోగించి దుర్భిణిని ఆ కాలంలోనే తయారు చేశారు.

మానవ మనుగడకు అవసరమైన విషయాలెన్నో మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. అవ్వన్నీ ఉపయోగించుకుంటూ, సమాజానికి ఉపయోగపడే ఇంకా ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఆవిష్కరించాల్సిన అవసరం వుంది.


(జీ తెలుగులో ప్రసారమైన గోపురం కార్యక్రమం ఆధారంగా)

1 comments:

oremuna said...

అవును కరక్టుగా చెప్పారు.
అలానే,
20వ శతాబ్దం మానవుడు టైం మిషన్ గురించి కూడా తెలుసు. అనుమానాలుంటే ఆదిత్యా 369 చూడగలరు.