Tuesday, October 27, 2009

శాస్త్రల్లో విమానాలు

Tuesday, October 27, 2009
మన విమానాల గురించి పూర్వం పురాణాల్లోనూ, శాస్త్రాల్లోనూ చెప్పారా?

అవునండీ. నిజమే. మన సాంప్రదాయాలకి మూలం పురాణాలూ, వేదాలూ. ఈ నాడు మనం కనిబెడుతున్న ఎన్నో విషయాల గురించి ఏనాడో మన పూర్వీకులు విశదంగా చెప్పారు. మన విమానాలగురించి ఎన్నో విశేషాలను భరద్వాజ మహర్షి యంత్రసర్వస్వం అనే గ్రంధంలో వ్రాశారు. అందులో 40 ప్రకరణలు వున్నాయి. ఒక ప్రకరణ మొత్తం విమానాల గురించే...అందులో విమాన చోదకుడికి ఏ అర్హతలు వుండాలి, విమాన ప్రయాణీకులు ఏ రకం వస్థ్రధారణ చెయ్యాలి, విమానంలో ప్రయాణించేటప్పుడు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ప్రమాదాల సమయంలో విమానాన్ని భూమిమీదకి ఎలాదించాలి, ప్రయాణీకుల్ని ఎలా రక్షించాలి, ఆకాశ మార్గాన పరిభ్రమిస్తున్న గ్రహాల ప్రభావాన్నుంచి ఎలా రక్షించుకోవాలి వగైరా ఎన్నో విషయాలు వ్రాశారంటే ఆశ్చర్యం వేస్తోందికదూ!!

అంతే కాదండోయ్...యుధ్ధ సమయంలో శత్రువులు మూర్ఛపోయేలాగా విమానచోదకుడు భయంకర శబ్దాన్ని సృష్టించగలగాలిట. అలాగే ఆకాశాన్ని ఏడు మండలాలుగా విభజించి, ఒకమండలంలో విమాన చోదకుడు వుంటే మిగతా ఆరు మండలాల్లో ఎవరు వున్నారు, ఏ దిశగా ప్రయాణిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు, వ్యూహాలూ, అన్నీ విమాన చోదకుడు ఊహించగలగాలి అని చెప్పారు.

త్రిపుర అనే విమానాల గురించి కూడా చెప్పారు. ఇవి ఆకాశం, సముద్రం, నీళ్ళల్లో కూడా తిరగగలవు. ఈ యంత్రసర్వస్వం గ్రంధం ఇప్పుడు తెలుగులోకి కూడా అనువదింపబడటమేకాదు, అందుబాటులోకూడా వుందిట.

ఇన్ని అద్భుత విషయాలగురించి ఏనాడో వ్రాసి పెట్టిన మన ఋషుల అపార జ్ఞానాన్ని ఆ శాస్త్రాలు అధ్యయనం చేయటం ద్వారా గ్రహించి, సమాజానికి ఉపయోగపడే ఎన్నో క్రొత్త విషయాలను కనుగొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా వున్నది.


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments: