Wednesday, December 17, 2008

ఎ.జి. ఆఫీసులో హాస్యోత్సవం.

Wednesday, December 17, 2008
బంధు మిత్రుల అభినందనలతో లో దృశ్యం
ప్రేక్షకులు ... నుంచున్న వారూ, ఆడవారూ రాలేదు ఈ ఫోటోలో
ఆలూ లేదు చూలూ లేదు లో ఒక దృశ్యం

ఎ.జి. ఆఫీసులో హాస్యోత్సవం

ఎక్కౌంటెంట్ జనరల్స్ ఆఫీసు నుంచి (టెలిఫోన్ భవన్ ఎదురుగా, రిజర్వు బ్యాంకు ప్రక్క, లకడీకాపుల్ లో వున్నది ఈ ఆఫీసు) ప్రసిధ్ధిగాంచిన అనేక సాహిత్యకారులు, రచయితలు, నటులేకాక అనేక రంగాలలో ఆరితేరిన గొప్ప వ్యక్తులు అనేకమంది ఉద్భవించారు. ఆ ఆఫీసులోని రంజని తెలుగు సాహితీ సంస్ధ ఉత్సవాలలో పాల్గొనాలని ఉవ్విళ్ళూరని సాహిత్యకారులు, అదే ఆఫీసులోని తెలుగు నాటక సమితి నాటక పోటీలలో పాల్గొనాలని ఉత్సాహం చూపించని కళాకారులూ వుండరంటే అతిశయోక్తి కాదు. ఈ ఆఫీసులో పెరిగి పెద్దవారైన రచయితలలో శ్రీయుతులు పరుచూరి వెంకటేశ్వర రావు, మల్లాది కృష్ణమూర్తి, శంకరమంచి పార్ధసారధి, డా. పాలకోడేటి సత్యనారాయణరావు, మరియు కీ.శే. డి. ప్రభాకర్, పమ్మి వీరభద్ర రావు వగైరా ఉద్దండులేకాక ఇంకా ఎందరో మహనీయులు వున్నారు. అలాగే అనేకమంది ఇక్కడ తెలుగు నాటక సమితి తరఫున నాటకాలు వేసి పేరు ప్రఖ్యాతులు పొందారు, సినిమా రంగం లో కూడా స్ధిర పడ్డారు. సాహిత్య, సినీ రంగానికి సంబంధించిన అనేక ప్రముఖులు ఇక్కడ అనేక కార్యక్రమాలలో పాల్గొన్న సందర్భాలలో ప్రతి ఒక్కరూ ఇక్కడ కార్యక్రమాలలో పాల్గొనాలని చాలా ఆసక్తిగా వచ్చామని చెప్తారు. కారణం ఇక్కడ వున్న అనేక మంది ప్రముఖులేగాక, అంతమంది చదువుకున్న శ్రోతలు, ప్రేక్షకులు ఒకచోట కూడటం కూడా అరుదు. మరి అక్కడ ఉద్యోగుల సంఖ్య వేలలో వుంటుంది. ఈ రెండు సంస్ధలేకాక ఇంకా అనేక సంస్ధలు ఇక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ సంస్ధలన్నింటి కార్యక్రమాలూ ఆ స్ధాయిలో వుంటాయి.

ఢిసెంబరు 16, 17, 18 2008 తారీకులలో తెలుగు నాటక సమితి ఎకౌంటెంట్ జనరల్స్ ఆఫీసు ఆవరణలో మధ్యాహ్నం 1-00 గం. నుంచి 2-00 గం. ల దాకా మళ్ళీ సాయంకాలం 6-00 గం. ల నుంచి 7-00 గం. లదాకా రాష్ట్ర స్ధాయి హాస్య నాటికల పోటీలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఈ క్రింది నాటికలు ప్రదర్శింపబడ్డాయి..

16-12-2008 మంగళవారం మధ్యాహ్నం శ్రీ సమ్మెట గాంధీ రచన దర్శకత్వంలో విశ్వశాంతి కల్చరల్ ఆసోసియేషన్ మెదక్ వారిచో తెలుగు దొంగలు అనే నాటిక ప్రదర్శించబడ్డది. సాయంత్రం శ్రీ పరమాత్ముని రచించిన తెల్ల చీకటి అనే నాటిక శ్రీ మల్లాది శివన్నారాయణ దర్శకత్వం, శ్రీ సైదారావు సంగీతంతో కళావర్షిణి, హైదరాబాదు వారిచే ప్రదర్శింపబడ్డది. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా శ్రీమతి జి. అనూరాధ, ప్రోగ్రామ్ హెడ్ జీ తెలుగు పాల్గొన్నారు.

డిసెంబరు 17, బుధవారం, మధ్యాహనం మల్లాది క్రియేషన్స్ హైదరాబాదు వారు శ్రీ మల్లాది రవికిరణ్ రచించిన ఆలూలేదు చూలూ లేదు అనే నాటికను శ్రీ మల్లాది భాస్కర్ దర్శకత్వంలో, శ్రీ బి.వి.రావు స్టేజి మేనేజ్మెంటు లో ప్రదర్శించారు. సాయంత్రం శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు, గుంటూరు వారిచే శ్రీ చిన్ని కృష్ణ రచించిన బంధుమిత్రుల అభినందనలతో అనే నాటికను శ్రీ గోపరాజు విజయ్ దర్శకత్వం, శ్రీ టి. సాంబశివరావు సంగీతంతో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సినీ హాస్య నటులు శ్రీ గౌతంరాజు గౌరవ అతిధిగా, డా. పాలకోడేటి సత్యనారాయణరావు, టి.వి. 5 క్రియేటివ్ హెడ్ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు.

డిసెంబరు 18, గురువారం మధ్యాహ్నం ప్రముఖ సినీ నటులు శ్రీ రావి కొండలరావు బృందం, ఆర్ కె ఆర్ట్స్ హైదరాబాదు వారిచే ప్రత్యేక ప్రదర్శన వైకుంఠపాళి ప్రదర్శింపబడుతుంది. ఈ నాటికకు శ్రీ రావి కొండలరావు రచించి దర్శకత్వం వహించటమేగాక, ఆయన, ఆయన శ్రీమతి రాధాకుమారి నటిస్తున్నారు కూడా. ప్రదర్శన సమయం మధ్యాహ్నం 1-00 గం. నుండి 2-00 గం. ల దాకా ఖచ్చితంగా పాటింపబడుతుంది. ఆసక్తి, అవకాశం వున్నవారు ఈ హాస్య నాటికను తిలకించే అవకాశం వదులుకోవద్దు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిధిగా శ్రీ శంకరమంచి పార్ధసారధి, ప్రముఖ నాటక, సినీ, హాస్య సంభాషణల రచయిత పాల్గొంటారు.


సాయంత్రం 6-00 గం. లకు శ్రీయుతులు జె.యల్ నరసింహం, తెనాలి శేషుకుమార్ గార్ల హాస్య కదంబం వుంటుంది. తదుపరి బహుమతి ప్రదానోత్సవం. ఈ ఉత్సవానికి ముఖ్య అతిధి శ్రీ జి.ఎన్ సుందరరాజా, I.A. & A.S., ప్రిన్సిపల్ ఎకౌంటెంట్ జనరల్ ఆత్మీయ అతిధి శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు, రంగస్ధల సినీ నటులు, సినీ, నాటక రచయిత, దర్శకులు. గౌరవ అతిధి శ్రీ మురళీ మోహన్, ప్రముఖ సినీ నిర్మాత, నటులు. విశిష్ట అతిధి శ్రీ సునీల్ ప్రముఖ సినీ హాస్య నటులు.









0 comments

Sunday, December 14, 2008

వెర్రి వెయ్యి విధాలు

Sunday, December 14, 2008
వెర్రి వెయ్యి విధాలు

14-12-2008 రాత్రి 10-30 కి జీ తెలుగు ప్రసారం చేసిన చల్ మోహన రంగా చూశారా ఎవరైనా? ఒక గ్రామ వాసులంతా (కోడారు అనుకుంటా) ఒక శునకానికి ఘనంగా సీమంతం జరిపించారు. పైగా ఇది మూడవసారి. మొదటిసారి రెండు మూడు కుటుంబాలే హాజరైన ఈ సీమంత కార్యక్రమానికి తర్వాత జనాలు పెరిగి ఇప్పుడు చాలామంది పాల్గొన్నారు. ఆ శునకం కూడా చాలా బుధ్ధిగా కూర్చుని వేడుకలన్నీ జరిపించుకుంది. దండలు వేయించుకుంది బొట్లు పెట్టించుకుంది, అందరిచేతా అక్షింతలు వేయించుకుంది. బోలెడు మిఠాయిలు, పళ్ళు, మామూలు సీమంతాలకు కూడా అన్నిరకాలు అన్నిచోట్లా పెట్టరేమో. పైగా కొత్త చీరెలు కూడా కానుకగా ఇచ్చారండోయ్. మనలో మనమాట. ఎంత మంచి కుక్కయినా ఆ చీరెలేం చేసుకుంటుంది? వెర్రెత్తి చింపి పోగులు పెడుతుందా? ఏమోమరి. అందుకే అంటారు. వెర్రి వెయ్యి విధాలు అని. అందులో ఇదొకటి అనుకుందామా?

1 comments

Monday, December 1, 2008

హిందుత్వమే అసలైన సెక్యులరిజం

Monday, December 1, 2008
హిందుత్వమే అసలైన సెక్యులరిజం

దివ్యధాత్రి, అక్టోబరు 2008 సంచికలో ప్రచురింపబడిన శ్రీ కార్తికేయ గారి రచన మీ అందరికోసం...............

ఘర్షణలు తలెత్తితే, హింస పెచ్చరిల్లి పరిస్ధితి ప్రభుత్వాలూ, పోలీసుల చేయి జారిపోతే, మత భేదం, వర్గభేదం లేకుండా మనందరమూ సైన్యాన్ని రంగంలోకి దింపమని కోరుకుంటాం. సైన్యం నిజాయితీపైన నిష్పాక్షికత పైన ఎవరికీ సందేహంలేదు.

పెను తుఫానులూ, ప్రకృతి బీభత్సాలూ మనల్ని చుట్టు ముట్టితే రక్షించేందుకు సైన్యం రావాలని కోరుకుంటాం. సైన్యంపై మన నమ్మకం అలాంటిది.

సైన్యం స్ధైర్యంమీద సందేహం లేదు. సైన్యం సామర్ధ్యంమీద సందేహం లేదు. సైన్యం సాహసం మీద సందేహం లేదు. సైన్యం సెక్యులరిజమ్ మీద అంతకన్నా సందేహం లేదు.

సైన్యం సెక్యులరిజమ్ గురించి కధలు కధలుగా చెప్పుకుంటారు. ప్రపంచం యావత్తూ భారతీయ సైన్యాల లౌకిక విలువలను ఆశ్చర్యంతో చూస్తుంది, ఆభినందిస్తుంది.

దేశ విభజన సమయంలో లక్షలాది హిందువులు శరణార్ధులై ప్రాణాలరచేత పుచ్చుకొని వస్తున్న సమయంలోనూ మన జవాన్లు అబ్బురపరిచే సంయమనాన్ని ప్రదర్శించారు.

కార్గిల్ యుధ్ధంలో మన జవాన్లు పట్టుబడితే పాకిస్తానీలు కళ్ళు ఊడబెరికి, మర్మాంగాలను కోసి క్రౌర్యానికి పరాకాష్ఠగా నిలిచిన సమయంలోనూ, చనిపోయిన పాకిస్తానీల భౌతిక కాయాలకు గౌరవంతో, వారి మత విధులను అనుసరించి అంతిమ సంస్కారాలను చేయించారు మన సైనికులు.

మన సైనికుల స్ధైర్య, సాహస, సామర్ధాలకూ, సెక్యులరిజానికీ పునాది ఎక్కడ ఉంది? వారి ధీరోదాత్తత ఏ పేరణా స్రోతస్సునుంచి ధారగా జాలువారుతోంది?

హిందూ భావనలలో నుంచి! నిస్సందేహంగా హిందూ జీవన విలువల్లో నుంచే!

ఆశ్చర్యంగా ఉందా? అయితే ఒక్కసారి మన సైనికులు, వారి వివిధ రెజిమెంట్ల రణ నినాదాలను పరిశీలించండి. అర్ధమైపోతుంది.

వీరత్వానికి మారుపేరైన మరాఠా రెజిమెంట్ వారి రణనాదం ‘హరహర మహాదేవ్’ .

పరాక్రమానికి పట్టుకొమ్మలాంటి గూర్ఖా రెజిమెంట్, సైనికుల రణనాదం ‘ జై మహాకాళీ – ఆయో గూర్ఖాలీ’ – అంటే ‘ జై మహాకాళీ – గూర్ఖావీరులు వస్తున్నారు’ అని అర్ధం. అసలు గూర్ఖా అన్నపదం – గోరఖ్ – అంటే గోరక్ష నుంచి పుట్టింది.

19 బెటాలియన్లతో కూడిన రాజపుటానా రైఫిల్స్ వారు యుధ్ధంలో గుండెనిండా ఊపిరిపీల్చుకొని, ఉచ్చస్వరంతో చేసే నినాదం – ‘రాజా రామచంద్రకీ జై’. 17 బెటాలియన్ల బలగంతో నిలిచే బీహార్ రెజిమెంట్ నినాదం’ జై బజరంగ బలి’ . 18 బెటాలియన్ల డోగ్రా రెజిమెంట్ ‘జ్వాలామాతాకీ జై’ అంటూ యాభై ఒక్క శక్తిపీఠాల్లో ఒకటైన జ్వాలాముఖిని స్మరిస్తారు.

కుమాయూ రెజిమెంట్ ‘ కాళికా మాతాకీ జయ్’ అంటే, నాగా రెజిమెంట్ ‘ జై దుర్గే నాగా’ అంటారు.

రాజపుట్ రెజిమెంట్ ‘బోల్ బజరంగ బలీకీ జై’ అని నినదిస్తే, మహార్ రెజిమెంట్ ‘బోలో హిందుస్తాన్ కీజై’ (బోలో ఇండియాకీ జై కాదు సుమా) అని గర్జిస్తారు.

జమ్మూ కాశ్మీర్ రెజిమెంట్ (మొత్తం 19 బెటాలియన్లు) ‘ దుర్గామాతాకీ జై’ అంటే జమ్మూ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ సైనికులు ‘ భారతమాతాకీ జై’ అంటారు. ఇక మొక్కవోని ధైర్యసాహసాలకూ, తెగింపునకూ మారుపేరైన జాట్ రెజిమెంట్ ‘జాట్ బలవాన్ – జై భగవాన్’ అంటారు.

గ్రెనెడియర్ లు ‘ సర్వదాశక్తిశాలి’ కి జై కొడితే, పంజాబ్ రెజిమెంట్ ‘ బోలే సో నిహాల్ – సత్ శ్రీ అకల్ ‘ అని విజయధ్వానం చేస్తారు.


ఇక గఢ్ వాలీ రెజిమెంట్ సైనికులు గొంతెత్తి ఉత్తరాంచల్ లోని హిమధామాల నడుమ విరాజిల్లే బదరీనాధుని నామాన్ని ఉచ్చరిస్తారు. 18 బెటాలుయన్లతో కూటిన ఈ రెజిమెంట్ రణనినాదం ‘బద్రీవిశాల్ లాల్ కీ జై’ . గఢ్ వాల్ రెజిమంట్ సైనికులున్నచోట బదరీనాధుని మందిరం ఉండాల్సిందే.

2002 నాటికి మన సైన్యంలో 9,80,000 మంది రెగ్యులర్ సైనికులూ, 8,00,000 మంది రిజర్వస్టులూ ఉన్నారు. వీరందరి గొంతుల్లోనుంచి వెలువడే యుధ్ధ నినాదాలన్నీ హైందవంతో అవినాభావంగా ముడిపడ్డవే. వీరత్వాన్ని ఆవాహన చేయటమే కాక, విలువలను వర్ధిల్ల చేయటమే ఈ నినాదాల లక్ష్యం.

పైగా కొరియన్ యుధ్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా సైనికుల మనోదార్ఢాన్ని పెంపొందించే దిశగా జరిగిన విస్తృత పరిశోధనలన్నిటిలోనూ ధార్మిక విశ్వాసప్రతీకల ద్వారా సైనికుల్లోమానసిక ఒత్తిడులను ఎదుర్కొనే స్ధైర్యాన్ని పెంచవచ్చునని, శత్రువు చేసే బ్రయిన్ వాషింగ్ ని తట్టుకోవచ్చని తేలింది.

హిందుత్వాన్ని మతతత్వంగా, ఛాందసంగా, మతోన్మాదంగా చూసే మాయపొర మన రాజకీయులకూ, మేధావులనబడే వారికీ కమ్మి ఉండవచ్చుగాక, మన సైన్యానికి కమ్మతేదు. ఎందుకంటే హిందుత్వమే సిసలైన సెక్యులరిజం కనుక

7 comments