Friday, March 19, 2010

తప్పు చేస్తే కళ్ళు పోతాయి అంటారు. ఎందుకు?

Friday, March 19, 2010




మన ఇళ్ళల్లో సాధారణంగా వింటూ వుంటాం.  పెద్దవాళ్ళు పిల్లల్ని భయపెట్టటానికి తప్పు చెస్తే కళ్ళు పోతాయమ, జాగ్రత్త అంటారు.  ఇది నిజమేనా?  తప్పు చెసినంత మాత్రాన కళ్ళు పోయేటట్లయతే ప్రపంచంలో చాలామందికి కళ్ళుకనిపించకుండా వుండాలికదా.  అలా కాలేదంటే ఈ మాట నిజంకాదా? 

చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు పిల్లల్ని దోవలో పెట్టాలని మాట వరసకు చెప్పినా, పెద్ద తప్పులవల్ల కళ్ళు పోవటం తప్పదు.  ఈ పెద్ద తప్పులేమిటి  అన్నిటికన్నా  పెద్ద తప్పులు మద్యపానం,  పరస్త్రీని తప్పు దృష్టితో చూడటం.  రెటీనాలో 10 పొరలు వుంటాయి.  ఒక్కొక్క పొరకు ఒక్కో వ్యాధి..డయబెటిక్ రెటినోపతి, రే చీకటి, రెటినో ప్రీ మెట్యూరిటీ, రెటీనా బ్లాక్ స్టోమా, దీన్నే ఐ కేన్సర్ అంటారు...ఇది 5 సంవత్సరాల లోపు పిల్లలకి వస్తుంది. ఒక్కోసారి కళ్ళు తీసేస్తారు.

ఇంత చిన్న పిల్లలు ఏ తప్పు చేస్తారని అంత తీవ్ర శిక్షలు అంటారా  మన శాస్త్రాల ప్రకారం పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే అన్నారు.  ఎంత ఆస్తులు సంపాదించినా మనం పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళం అంటారు కానీ, మనం సంపాదించిన పాప పుణ్యాలు తప్పక మనతో తీసుకెళ్తాం ..మరి వచ్చే జన్మలో కూడా వాటిని అనుభవించాలికదా.

వీటిని పక్కన బెడదాం.  సైన్స్ ఏమి చెబుతోంది  సైన్స్ కూడా ఒప్పుకుంటుంది..మనిషి చేసే తప్పులవల్లనే జబ్బులు వస్తాయని.  ఉదాహరణకి మనిషి తన తప్పుడ నడత వల్లనే సుఖ వ్యాధులు తెచ్చుకుంటాడు.  వీటివల్ల కంటి జబ్బులు, ఆయుక్షీణం, అనేక రకమైన వ్యాధులు. ఈ విషయాలలో అధ్యయనం చేసి రాసిన పుస్తకాలు ఎన్నో వున్నాయి.  జ్యోతిష్య శాస్త్రాన్నీ, ధర్మ శాస్త్రలనీ నమ్మక పోయినా  సైన్స్ ని నమ్మేవాళ్ళు అనేకమంది.  అదుపుతప్పిన మద్యపానం కళ్లమీద తీవ్ర పరిణామాన్ని చూపిస్తుంది.  అందరూ కావాలని ఇలాంటి తప్పులు చెయ్యరు.  కొన్ని పరిస్ధితులు, కొందరు స్నేహితులు వగైరా ఎన్నో కారణాలు..చూసి తొక్కినా, చూడకుండా తొక్కినా నిప్పు తొక్కితే కాలుతుంది.  వీటివల్ల వచ్చే బాధలు, వ్యాదులు, మనమొక్కళ్ళమే కాదు, వంశపారంపర్యంగా అనుభవించాల్సివస్తుంది.  అందుకే మన ఆలోచనా పరిధి నియంత్రంచుకోవాలి.  దీనివల్ల మన కళ్ళని, మన ఆరోగ్యాన్నీ మనం రక్షించుకోవటమేగాక తర్వాత తరాల వారి ఆరోగ్యాన్ని కూడా రక్షించిన వారమవుతాము.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




9 comments

అంధత్వ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి ?




అంధత్వ నివారణకు మన అలవాట్లు సరిగ్గా వుంచుకోవటంద్వారా జాగ్రత్త పడవచ్చు.  ఆయుర్వేద శాస్త్రం ప్రకారంగానీ, పెద్దవారు చెప్పేదాని ప్రకారంగానీ ఏ వ్వక్తి అయినా బాగా ఎండనుంచి రాగానే చల్లని వాతావరణంలోకి వెళ్ళకూడదు.  చన్నీళ్ళ స్నానం చెయ్యకూడదు.  దీనివల్ల నేత్ర హాని కలుగుతుంది.  అలాగే ఎండలోంచి రాగానే అతి సూక్ష్మ వస్తువులను చూడటానికి ప్రయత్నించకూడదు.  దాని వల్ల దృష్టి నరాలన్నీ కేంద్రీకరించి దృష్టి మొత్తం ఒకచోట నిలుపవలసి రావటంతో కళ్లు దెబ్బతినే ప్రమాదం వుంది.  అలాగే అతి చిన్న వస్తువులను ఎక్కువగా చూడవలసివస్తే భూతద్దం వుపయోగించటం మంచిది.

కొందరికి రాత్రుళ్ళు ఎక్కువసేపు మేలుకుని, పగలు ఎక్కువసేపు నిద్రపోవటం అలవాటు.  దీనివల్లకూడా వ్యాధులు వస్తాయంటారు.  ఇంక ఆహార పదార్ధాలవిషయం చూస్తే, పుల్లటి వస్తువులను తగ్గించాలి.  ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మద్యపానంవల్లకూడా కంటికి హాని జరుగుతుంది.  అరగని పదార్ధాలు తినకూడదు. అజీర్ణంవల్ల అనేక రోగాలు వస్తాయి..అవి కంటికి కూడా వ్యాపించవచ్చు.   సరిపడని పదార్ధాలవల్ల ఎలర్జీలొస్తాయి..అవి కంటిలో కూడా రావచ్చు.

ఇవ్వన్నీ చెయ్యకూడనివి చెప్తున్నారు..మరి చేయవలసినవేమిటంటారా?  ప్రతి వ్యక్తీ వారి వారి జీర్ణ శక్తినిబట్టి, వారి ఆహారపు అలవాట్లనుబట్టి, వారి శరీర తత్త్వాన్నిబట్టి వారికి సరిపోయే బలవర్ధక ఆహారం,  తొందరగా జీర్ణమయ్యేది తీసుకోవాలి.  అలాగే ఉద్రేకాలను, నెగెటివ్ ఆలోచనలను వీలయినంత అదుపులో వుంచుకోవాలి.  బీ పీ వల్ల కంటికి చాలా ముప్పు.  కనుక ప్రశాంతంగా వుండటం అలవరచుకోవాలి. 

పాతకాలం పధ్ధతి అని తీసేసినా, అతి మంచి అలవాటు పాదాలకి అప్పుడప్పుడూ నూనె లేక ఆముదం మర్దన చెయ్యటం.  పాదాలలో గాంధార, పుష నాడులుంటాయి.  వాటిమీద సరిపడే ఒత్తిడి తెస్తే చిన్న చిన్న నేత్ర వ్యాధులు మన జోలికి రావు.  చన్నీటితో తరచూ కాళ్ళు కడుక్కోవటం వల్లకూడా కంటికి మేలు జరుగుతుంది.  కళ్ళు బాగా మండుతున్నప్పుడు కళ్ళకి తగినంత విశ్రాంతి ఇవ్వటం,  చన్నీళ్ళతో కడుగుకోవటం, చెయ్యాలి.

చివరికి చెప్పేదేమిటంటే, మన ఆరోగ్యం చాలామటుకు మన చేతుల్లో వుంది.  మన అలవాట్లు, ఆహార వ్యవహారాలు, ఆలోచనలూ సరిగ్గా వుంటే చాలామటుకు నేత్ర వ్యాధులని అరికట్టవచ్చని మన శాస్త్రాలు, ఆయుర్వేద శాస్త్రాలేకాదు, చదువుకున్న ప్రతివారూ చెబుతూనే వున్నారు....ఆచరణే....

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




0 comments

చిన్న పిల్లలకు కంటి జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?




చిన్న పిల్లలకు పుట్టక ముందునుంచే కొన్న జబ్బులు వస్తాయి, కొన్ని జబ్బులు పుట్టిన తర్వాత వచ్చేవి.   నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు రెటీనా ప్రీ మెచ్యూరిటీ వల్ల కొన్ని నేత్ర వ్యాధులు రావచ్చు, జాగ్రత్తలు తీసుకోక పోవటంవల్ల తర్వాత అంధత్వం రావచ్చు.  చాలా మటుకు అంధత్వందాకా తీసుకెళ్ళకపోవచ్చుకానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

తర్వాత పుట్టిన పిల్లలు వెలుతురు, లైటు చూడలేక వెంటనే కళ్ళు మూసుకుంటే డాక్టరుని సంప్రదించాలి.  అలాగే కళ్ళు నీళ్ళుకారుతున్నా, ఎఱ్ఱబారినా, అశ్రధ్ధ చెయ్యకుండా కంటి డాక్టరుకి చూపించాలి. 

వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు కూడా కొన్ని వుంటాయి.  తల్లి దండ్రులకు రేచీకటిగానీ, రెటీనా సంబంధిత  వ్యాధులుగానీ వుంటే పిల్లల్ని తరచూ కంటి వైద్యులకు చూపించాలి.  వంశపారంపర్యంగా వచ్చే వ్యాధులు పిల్లలకు వచ్చే అవకాశం వుంది కనుక ముందే జాగ్రత్త తీసుకోవటం మంచిదికదా.  కొందరు పిల్లలకు  చిన్నప్పుడే ధైరాయిడ్ సమస్యల వల్లకూడా కళ్ళ జబ్బులు, అశ్రధ్ధ చేస్తే అంధత్వం వచ్చే అవకాశాలు వున్నాయి.  ఒక 9 ఏళ్ళ అమ్మాయికి కళ్ళు సరిగ్గా కనబడకపోతే అనేకమంది డాక్టర్లకు చూపిస్తే ఏ వెయ్యిమందిలో ఒకళ్ళకో వచ్చే జబ్బిది కళ్ళు రాకపోవచ్చు అని చెప్పారు.  తర్వాత ఆ పాపకే ఏదో కారణంవల్ల ధైరాయిడ్ పరీక్ష చేయించి దానికి మందులు వాడారు.  ఆ సమస్య సరి కాగానే కళ్లుకూడా కనబడటం మొదలయింది.  అంటే, శరీరంలో తీవ్ర ఋగ్మతలు వున్నా కంటి జబ్బులు వచ్చే అవకాశం వుంది.  ఫిట్స్ వచ్చే పిల్లలకు 5 సంవత్సరాలుపాటు స్టెరాయిడ్స్ ఇస్తారు.  వారికి నరాలు కంట్రోల్ లో వుండాలంటే ప్రశాంతమైన నిద్రపోవటం తప్పనిసరి.  వారికి ఆ మందులు వాడటం తప్పనిసరి, ఆ మందులవల్ల కంటి సమస్యలు వచ్చే ప్రమాదం వుంది కనుక తరచూ కంటి వైద్యులచేత పరీక్ష చేయించాలి.

కొన్ని జబ్బులు పిల్లల అలవాట్లవల్లగానీ, పెద్దవాళ్ల అజాగ్రత్తవల్లగానీ రావచ్చు.  కొందరు పిల్లలు, పుల్లలతో, సూదులతోగానీ ఇంకేవైనా షార్ప్ గావుండే వస్తువులతో ఆడతారు.  తెలిసో, తెలియకో ఈ వస్తువులు కంటికి తగిలి కార్నియా దెబ్బ తినవచ్చు.  అలాగే కొందరు కుర్చీ అందదని పిల్లల్ని డైనింగ్ టేబుల్ మీద  కూర్చోబెడతారు.  పిల్లల చేతులు వూరికే వుండవు కదండీ.  ఇప్పుడు అందరి ఇళ్ళల్లో వెనిగర్ వాడటం ఎక్కువైంది.  ఆ సీసాగానీ, పచ్చళ్ళేవైనాగానీ పక్కనే వుంటే అది తీసి చేతిలో వంపుకోవటం వగైరాచేసి ఆ చేతుల్తో కళ్ళు రుద్దుకున్నా కళ్ళుపాడయ్యే అవకాశం వుంది.  అలాగే బాత్ రూమ్ లో వాడే యాసిడ్స్ కూడా.  ఇవేవీ పిల్లల అందుబాటులో వుంచకూడదు. 

అన్నింటికన్నా ఎక్కువ ప్రమాదకరమైనవి టపాకాయలు.  టపాకాయలు కాల్చేటప్పుడు పిల్లల అజాగ్రత్త, పెద్దల అశ్రధ్ధ  ప్రతి ఏటా వేలమంది పిల్లల కంటి జబ్బులు, కళ్ళు పోవటానికి కారణాలవుతున్నాయి.

పిల్లలకిచ్చే ఆహారం విషయం కూడా జాగ్రత్త వహించాలి.  వారికి ఏది పడుతుంది, ఏది పడదు అని చూసుకుంటూ సరైన పోషక పదార్ధాలు వారికి తినిపించాలి.

పిల్లలపట్ల పెద్దవారు తీసుకునే జాగ్రత్తలవల్ల పిల్లల్లో చాలామటుకు కంటి జబ్బులు, అంధత్వం నివారించవచ్చు.  మన అజాగ్రత్తవల్ల కొని తెచ్చుకునే సమస్యలకి జీవితాంతం క్షోభ పడాల్సి వస్తుంది కనుక మన జాగ్రత్తలో మనం వుండటం అవసరం.  కదా!!??

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



2 comments

Saturday, March 13, 2010

పాము కాటుకి మనుషుల ప్రాణాలు పోతాయా?

Saturday, March 13, 2010



అదేంటి,  పాము కాటేస్తే మనుషులు చచ్చిపోరా అని అడుగుతున్నారా?  నిజానికి అన్ని పాములూ కాటేస్తే మనుషులు చచ్చిపోరండీ.  విషపూరితమైన పాములు కాటేస్తే మాత్రమే చనిపోయే అవకాశాలున్నాయి...అది కూడా సకాలంలో సరైన వైద్యం అందకపోతేనే. 

మరి అధ్యయనాలు ఏమి చెబుతున్నాయి?  పాముల్లో కొన్ని వందల రకాలున్నాయి.  అవ్వన్నీ కరిచినంత మాత్రాన మనిషికి ఏమీ కాదు.  అయితే విషపూరితమైన పాములు కాటేస్తే, వెంటనే ప్రధమ చికిత్స, పైద్య సహాయం అందకపోతే ప్రాణాలుపోయే అవకాశం వుంది.  పరిశోధనలు ఏమి చెబుతున్నాయంటే,  సాధారణ పాములు కరిస్తే ఏమీ కారుకానీ, ఆ పాము కాటుకన్నా, పాముకరిచిందే, ఇంక నేను బ్రతకను అనే అధైర్యంతో గుండె ఆగి మరణించేవారి సంఖ్యే ఎక్కువ.

కొందరు పాము కాటేస్తే, కాటేసిన మనిషి గురించి జాగ్రత్త తీసుకోకుండా, కాటేసింది ఏ పాము...నాగుపామా, కట్లపామా..అనే పరీక్షకోసం దాని వెనకాలబడతారు.  అలా కాకుండా ముందు పాము కరిచిన వ్యక్తికి ప్రధమ చికిత్స అందించాలి.  పాము కరిస్తే మనమేం చెయ్యగలమని అనకండి.  ఒకవేళ అది విషపూరిత పామైతే ఆ విషం శరీరమంతా ఎక్కకుండా, కరిచిన చోటుకి కొంచెం పైన ఒక గుడ్డతోగాని, తాడుతోకాని, గట్టిగా కట్టి, ఆ చెడు రక్తం శరీరమంతా పాకకుండా జాగ్రత్త పడాలి.  పాము కరిచిన వ్యక్తికి గాలి ధారాళంగా ఆడేటట్లు వుంచి వెంటనే వైద్య సహయం అందించాలి.  ఆ వ్యక్తికి కరిచింది మామూలు పామేనని, ఏమీ కాదని ధైర్యం చెప్పాలి.  దానితో మామూలు పామైతే పాముకాటు భయంతో గుండెపోటు అవకాశాలు తగ్గుతాయి, తర్వాత సకాలంలో వైద్య సహాయంతో ప్రాణాపాయమేమైనా వుంటే దానినుంచీ బయటపడచ్చు.

పామేకాదు, ఏ సమయంలోనైనా, ఏ విషపురుగు కుట్టినా అన్నింటికన్నా ఆ కరవబడ్డ వ్యక్తికి ధైర్యం, సకాలంలో వైద్యం ఆపదనుంచీ బయటపడటానికి అత్యవసరం.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



2 comments

Monday, March 8, 2010

వచ్చే జన్మలో....

Monday, March 8, 2010



యాత్రలు చాలా చేస్తున్నారు..పుణ్యం చాలా సంపాదించేశారే.  .మోక్షం కోసమా...ఇలాంటి ప్రశ్నలతో విస్మితురాలినయ్యాను.  యాత్రలు చేసినంతమాత్రాన మోక్షం వచ్చేస్తే నాకు పోటీగా ఎంతమంది యాత్రలు చేసేవాళ్ళుంటారో..కదా...అయినా నాకెందుకో జన్మ రాహిత్యం ఇష్టం లేదు.  జన్మ వుందో లేదో నాకు తెలియదుగానీ వుంటేమాత్రం మంచి మనిషిగా పుట్టాలనుకుంటాను.  స్త్రీ, పురుషులలో ఏ రూపమయినా పర్వాలేదు.  ఈ జన్మలో స్త్రీగా పుట్టటంవల్ల నేను పెద్ద ఇబ్బందులు పడలేదు అనటంకన్నా ఇబ్బందులు పడకుండా ఎప్పుడూ ఏదో రక్ష లభించింది అంటే సరిగ్గా వుంటుందేమో..  అందుకే మనం చేసే మంచి మనల్ని కాపాడుతుందనే విశ్వాసం వున్నది.  అదృష్టవశాత్తూ ఈ జన్మలోకూడా అవకాశం వున్నంతవరకూ నాకు చేతయినంతమటుకూ మంచే చేశాను.  ఏ విషయంలోనైనా నాకు నేను సమాధానం చెప్పుకోగలిగే స్ధితిలోనే వున్నాను.  అందుకే స్త్రీగా పుట్టాలంటే నాకు భయంలేదు.

ఇంకా చెప్పాలంటే కొంచెం గొప్పగా కూడా వుంటుందేమో.  స్త్రీలకున్న ఆప్యాయతలూ, అభిమానాలూ, అందరూ తనవారనుకునే స్వభావం, తనకోసం చూసుకోకుండా ఎదుటివారిగురించి ఆలోచిచే నైజం, కుటుంబాన్ని ఒక్క తాటిమీద నడపగలిగే నైపుణ్యం,  అంటే ఓర్పు, నేర్ప, త్యాగం, సహనశీలత,  మగ పుట్టుకలో వుందా  ఏమో.  బహుశా అందరిలో అన్నిగుణాలూ పోతపోసి వుండవేమో.  ఎందుకంటే వుంటే వాళ్ళు ఆడవళ్ళల్లాగానే పుడతారు. 

అయితే వీటన్నింటితోపాటు భగవంతుణ్ణి ఇంకొక్క వరంకూడా స్త్రీకి ఇవ్వమని గట్టిగా అడుగుదామనుకుంటున్నా. స్త్రీలందరూ ఈ విషయంలో విప్లవం చేసయినా సరే సాధించాల్సిన అవసరం ఎంతయినా వుంది.  అదే, దాడిచేసే మగవాడిని అణగదొక్కే శక్తి...ఆలంబనలేని అతివలకి ప్రపంచాన్ని ఎదుర్కొనే శక్తి యుక్తులు.  స్త్రీకి ప్రేమేకాదు, అవసరమైతే అపర కాళికలాగా అవతరించే శక్తి కూడా కావాలి.



5 comments

Wednesday, March 3, 2010

శివ మానస పూజ ఎలా చేస్తారు?

Wednesday, March 3, 2010


శివార్చన, లేదా ఏ దేవతార్చనైనా మానవులకు మంచి ఫలితాలనిస్తాయంటారు.  అయితే అనేక కారణాలవల్ల అందరికీ ప్రతి రోజూ యధావిధిగా పూజ చేయటం కుదరకపోవచ్చు.  వృధ్ధాప్యంవల్ల, అనారోగ్యంవల్ల, ప్రయాణంలో, ఇలా కూర్చుని అభిషేకమూ, అర్చనా చేసే అవకాశం లేక పోయినా, చెయ్యాలనే తపన మాత్రమున్నవాళ్ళు మరి ఏం చెయ్యాలి?  ధర్మ గ్రంధాలు ఏం చెబుతున్నాయి?

అసలు భగవంతుని పూజలో మానసిక పూజే విశేషమయినది.  మనసులో భగవంతుని నిలుపుకోవటం అలవాటు చేసుకోవటానికి, మనసు నిశ్చలంగా వుండటానికి ప్రత్యక్షంగా విగ్రహాన్ని పూజించాలి. 

అలా కుదరనప్పుడు, మన మానసిక శక్తిని పరీక్షించుకోవటానికి,  భగవంతుణ్ణి మన మనసులో నిలుపుకోవటానికి భగవంతుడు కల్పించిన అవకాశంగా దాన్ని భావించి మానసిక పూజ చేసుకోవాలి.  అది ఎలా చెయ్యాలి?  భగవంతుడు అక్కడ వున్నాడని భావించి  ఆయనకి రత్న సింహాసనం వెయ్యాలి.  ఆకాశ గంగని తెచ్చి మనసారా  అభిషేకించాలి.  వివిధ రకాల ఆభరణాలతో అలంకరించాలి.  సుగంధ భరితమైన పూవులతో, మారేడ దళాలతో పూజించాలి.  ధూపం, దీపం అన్నీ సమర్పించాలి.  షడ్రషోపేతమైన వివిధ భక్ష్యభోజ్యాలను, మధుర ఫలాలను నివేదించాలి.  స్వామీ, నేను చేసిన వివిధ సపర్యలు స్వీకరించి నన్ను దయచూడమని వేడుకోవాలి.

బాహ్యంగా విశేష పూజ చేసే అవకాశం లేనివారు బాధపడకుండా భగవంతుడు అది మనకిచ్చిన అవకాశంగా తీసుకుని భగవంతుని మనసులో నిలుపుకుని పూజించవచ్చు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

ఈ మానసిక పూజ వల్ల నాకు కనబడ్డ ఇంకో విశేషమేమిటంటే  బాహ్యంగా మనం సమకూర్చుకునే సంబారాలు కొన్నే వుంటాయి కానీ మానసికంగా మన వూహ పదునును బట్టి ఎక్కడెక్కడి పదార్ధాలూ, పువ్వులూ, అత్యంత అందమైన ఆభరణాలు వగైరా సమర్పించవచ్చు.

0 comments

Tuesday, March 2, 2010

ఏ శివ లింగాలకు పూజ చేస్తే ఎలాంటి ఫలితం వుంటుంది?

Tuesday, March 2, 2010



జ్యోతిర్లింగాలకు పూజ చేస్తే విశేష ఫలితం వుంటుంది.  అలాగే సిధ్ధులు, పురాణ పురుషులు, మహిమాన్వితులు ప్రతిష్టచేసిన లింగాలను పూజించినా మంచి ఫలితం వుంటుంది.  స్వయంభూ లింగార్చన కూడా.

లింగాలలో అనేక రకాలు వున్నాయి.  వాటిని పూజిస్తే వివిధ రకాల కామ్యాలు సిధ్ధిస్తాయంటారు.  అవేమిటో తెలుసుకుందామా?                        

వజ్ర లింగాన్ని పూజిస్తే ఆయుః వృధ్ధి,  ముత్యం లింగాన్ని సేవించటం రోగ నాశకరం, పద్మరాగ లింగం లక్ష్మీ ప్రాప్తినిస్తుంది, పుష్యరాగం లింగాన్ని పూజిస్తే యశస్సు, నీలం లింగం ఆయుః వృధ్ధి, మరకత లింగం పూజ సుఖ ప్రాప్తి, స్ఫటిక లింగార్చన సర్వకామనలనూ సిధ్ధింపచేస్తుంది.  లోహ లింగ పూజ శతృనాశనాన్ని చేస్తుంది, ఇత్తడి లింగార్చన తేజస్సునిస్తుంది.  గంధం లింగార్చన స్త్రీలకు సౌభాగ్యాన్నిస్తుంది, వెన్న లింగం మోక్షాన్ని ప్రసాదిస్తుంది, ధాన్యపు పిండితో చేసిన లింగార్చనవల్ల ఆరోగ్యం బాగుపడుతుంది.

ఇలా రక రకాల లింగార్చనలవల్ల రకరకాల ఫలితాలున్నాయి.  రసలింగం, అంటే పాదరసం వున్న లింగానికి అభిషేకం చేసి ఆ తీర్ధం సేవిస్తే సర్వవ్యాధులు నాశనమవుతాయని ప్రసిధ్ధి.  ఇది పరిశోధనల ద్వారా కూడా నిర్ధారింపబడినది. ఈ తీర్ధాన్ని సేవించటంవల్ల కేన్సర్ వగైరా పెద్ద వ్యాధులు పోవటమే కాకుండా మానసిక చింతలు దూరమయి మనశ్శాంతి కలుగుతుంది.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

మనలో మాట

ఈ పాదరస శివ లింగం గురిచి నేను సేకరించిన మరికొన్ని విశేషాలు చదవండి

పాదరస శివ లింగాన్ని పూజించిన వారికి నెరవేరని కోరికలు వుండవు అని బ్రహ్మ పురాణంలో చెప్పబడింది.  ఈ లింగం చిన్నగా వున్నా చాలా బరువుగా వుంటుంది.  దీన్ని ఇంట్లో వుంచి కూడా నిత్యం పూజ చేసుకోవచ్చు. 

మన దేశంలో పాదరస శివలింగం వున్న ఒకే ఒక దేవాలయం ఉజ్జయినిలో సిధ్ధాశ్రమం.  ఇక్కడి శివ లింగం బరువు సుమారి 1500 కిలో గ్రాములు.  ఫ్రపంచంలో ఎక్కడా ఇటువంటి శివలింగం లేదంటారు.  భక్తులు ఈ లింగాన్ని తాకి దర్శనం చేసుకోవచ్చు.  మనిషిలోని నెగటివ్ ఎనర్జీ తగ్గించే శక్తి ఈ లింగానికి వుంది.  ఈ శివ లింగానికి కొంతసేపు తల ఆన్చితే తలలో నరాలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయని అక్కడివారి నమ్మకం.



0 comments