Tuesday, November 17, 2009

గోపురం

Tuesday, November 17, 2009
పది రోజులనుంచీ చికెన్ గున్యాతో స్నేహం చెయ్యటంతో ఏమీ రాయలేక పోయాను. చాలా రోజులయిందికదూ కలిసి. మళ్ళీ గోపురం కబుర్లతోనే మొదలు పెడుతున్నాను.

శాస్త్రం జున్ను తినకూడదని చెప్తోందా?

అవును. శాస్త్రం ప్రకారం జున్ను తినకూడదు. దానికి కారణం మనకేదన్నా నష్టం జరుగుతుందని కాదు. అప్పుడే ఈ ప్రపంచంలోకి వచ్చిన దూడలకి సరైన పోషణ లభించదని. పశువులు ఈనిన తర్వాత మొదటి పదిరోజులూ వాటి పాలల్లో దూడలకి పోషక పదార్ధాలు చాలా వుంటాయి. ఆ పాలని దూడలే తాగటంవల్ల అవ్వి బలంగా పెరుగుతాయి. పశువులు ఆరోగ్యంగా వుంటే లాభాలు మనకే. మన పనులు సజావుగా సాగటమేకాక పశు సంపద కూడా ఆరోగ్యకరంగా వృద్ధి అవుతుంది. ఆపాల జున్ను మనం తినటంవల్ల ఆ పోషక పదార్ధాలు దూడలకి అందవు. అవి బలహీన పడటమేకాక వాటి సంతతి కూడా బలహీనంగానే వుంటుంది. దానితో మనం బలమైన పశు సంపదను నష్టపోతాం.

మనం కొంచెం భూత దయ చూపించి, అనేక పోషక పదార్ధాలూ, రోగ నిరోధక శక్తి వున్న పాలని దూడలని తాగనిస్తే పశువులు ఆరోగ్యంగా పెరుగుతాయి. ఈ కారణాలవల్లనే శాస్త్రం మనల్ని జన్ను తినకూడదని చెప్తోంది.


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)

0 comments: