Sunday, January 9, 2011

సంక్రాంతి సమయంలో నువ్వుల వాయనం తీసుకోవచ్చా?

Sunday, January 9, 2011


 జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పౌర్ణమి రోజున పుష్యమీ నక్షత్రం వున్న మాసాన్ని పుష్యమాసమంటారు.  ఇది శని నక్షత్రం.  శని ఆయుఃకారకుడు.  ఈ కాలంలో నువ్వులు తినమంటారు.  ఎందుకు?  సకల రోగాలను పోగొట్టే శక్తి తిలలకున్నది.  ఇది హేమంత ఋతువు.  ఈ ఋతువులో చలి ఎక్కువ వుంటుంది.  శరీరంలో శీతం ఎక్కువ.  ఒళ్ళు నొప్పులు, కఫం, జలుబు, దగ్గు, వగైరా చలి వలన వచ్చే రోగాలు కూడా ఎక్కువే.   శరీరంలో తగ్గిన ఉష్ణోగ్రత తిరిగి రావాలంటే నువ్వులను తినాలి.  రోగాన్ని తీసేసి, శరీరంలో ఉష్ణాన్ని పెంచే శక్తి నువ్వులకున్నది. 

శాస్త్ర ప్రకారం ఈ మాసంలో నువ్వుల పిండిని ఒంటికి రాసుకుని స్నానం చెయ్యాలి.  దానివలన శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది.  నువ్వులని తినాలి, వాయనమివ్వాలి, దానం చెయ్యాలి, తర్పణాలు వదలాలి. 

కొంతమందికి ఈ సంక్రాంతి సమయంలో నువ్వుల వుండలు, నువ్వుల జీడీలు, నెగుళ్ళు అని నువ్వులు, పంచదార వగైరా కలిపి అందరికీ పంచుతారు.  నువ్వులు, తీపి తిని  నువ్వు నూరేళ్ళు జీవించమని, తీపి తిని తియ్యగా మాట్లాడమని,  సంతోషంగా ఆరోగ్యంగా వుండమనీ బంధు మిత్రులకి శుభాకాంక్షలు తెలియజేస్తారు.   తెల్లనువ్వులు లక్ష్మీప్రదమైనవి.  సంక్రాంతి సమయంలో వీటిలో లక్ష్మి నివసిస్తుందంటారు.  వీటిని ఎవరైనా పంచిపెడితే తీసుకోవటంలో తప్పులేదు.  కేవలం నల్ల నువ్వులు శని సంకేతాలు.  నల్ల నువ్వులు తీసుకోకూడదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments:

astrojoyd said...

krishnadevaraya daily drunks half ltr of nuvullanoone nd prcticised vyaayaamaa exercizes.