Saturday, November 21, 2009

గయలో ఇష్టమైన పదార్ధాలు వదలాలంటారు, ఎందుకు?

Saturday, November 21, 2009

గయలో ఇష్టమైన పదార్ధాలను వదలాలంటారు. ఎందుకు?

శాస్త్రం ప్రకారం, మన జీవితంలోధర్మంతో అర్ధ, కామాల్ని జయించిమోక్షాన్ని సాధించాలి. దానికోసం కామక్రోధ మద, మాత్సర్యాలను వదలాలని. ఇవ్వన్నీ వదిలేసి నిష్కల్మషంగాజీవించండి అంటే...ఎంతమంది వింటారో, . మవుతుందో మీకూ తెలుసు. ఇదికలికాలం. అందుకే, పెద్దలు అహంకార, మద, మాత్సర్యాలకిమనల్ని దూరం చేసే ప్రయత్నంలోదానికి నాందిగా చెప్పిందే గయలోవిష్ణు పాదాల దగ్గర ఇష్టమైనపదార్ధాన్ని వదిలెయ్యటం.

ఇలా వదిలేసినవారు మళ్ళీ తమ జీవితంలో ఆ పదార్ధాన్ని తినరు. అంటే క్రమ శిక్షణతో మన ఇష్టా ఇష్టాలను నియంత్రించుకోవటం మొదలు పెడతారన్నమాట. ఒక విషయంలో మొదలైన నియమాలు క్రమేపీ జీవితంలో మిగతా విషయాలకి కూడా పాకుతాయి. దానితో నియమబధ్ధమైన జీవితం మొదలవుతుంది. మనిషి తను బాగా బ్రతకటమే కాదు, ఎదుటివారికి కూడా హాని కలగకుండా వుండాలని ఆలోచిస్తాడు. అంటే సమాజంలో మంచి పెరుగుతుంది. ఈ కలికాలంలో మనం నిబధ్ధతగా వుంటే, మనకి మనం మేలు చేసుకుని ఎదుటివారికీ మేలు చేస్తే అదే మోక్షం. నిజానికి మన మంచిని మనం చూసుకుని ఎదుటివాళ్ళ మంచి కూడా కాంక్షిస్తే సమాజం దానంతటదే బాగుపడదా చెప్పండి.

మూఢ నమ్మకాలు చొప్పిస్తేగానీ మాట వినని వాళ్ళకోసం పెద్దలు వాటిని చెప్పినా, వాటి వెనక సమాజ శ్రేయస్సుకోసం వారు ఆలోచించిన తీరు విశ్లేషించి వారి ఆలోచనా ధోరణిని అర్ధం చేసుకుని ఆచరించగలిగితే వచ్చే మార్పుకు అంతా స్వాగతం పలకాల్సిందే.


(జీ టీవీ ప్రసారం చేసిన గోపురం కార్యక్రమం ఆధారంగా)


0 comments: