Saturday, March 12, 2011

ఇంట్లో దేవుడి విగ్రహాలను ఏ విధంగా కడగాలి?

Saturday, March 12, 2011


చాలామంది దేవుడి విగ్రహాలను ఇంట్లో పాత్రలు శుభ్రపరచుకునే సబ్బుతోనో, డిటర్జెంట్ పౌడర్ తోనో తోముతుంటారు. నిత్యం అభిషేకం చేసేవాటిని తోమక్కరలేకపోయినా, వెండి, రాగి మొదలగు కొన్ని లోహాలు తేమ గాలికి నల్లబడి, మెరుపు తగ్గుతాయి. అందుకని వాటిని తోమి శుభ్రపరచటం అవసరం.

అయితే విగ్రహాలకు మనం ప్రాణ ప్రతిష్టచేసి, అర్చన చేసి, నైవేద్యం పెడతాం. భగవంతుని శక్తి వాటిలో వుంటుంది. మరి వాటిని ఎలా పడితే అలా తోమెయ్యకూడదుకదా. మరెలా చెయ్యాలంటే ఆలయాల దగ్గర విభూతి వుండలు అమ్ముతూ వుంటారు. అవి తెచ్చి వాటితో వెండి విగ్రహాలను అతి సున్నితంగా పసి పిల్లలకు స్నానం చేయిస్తున్నట్లు జాగ్రత్తగా తోమాలి. అలాగే రాగివాటిని శనగపిండిలో పెరుగు వేసి దానితో తోమాలి. చింతపండు, నిమ్మకాయ వాడితే మరు రోజుకి నల్లబడతాయి. దేవుళ్ళ విగ్రహాలను సబ్బులు, యాసిడ్లు, డిటర్జంట్లతోకాకుండా పైన చెప్పిన విధంగా పసి పిల్లలకి స్నానం చేయిస్తున్నంత సున్నితంగా శుభ్రం చెయ్యాలి. అవి భగవత్ స్వరూపాలు మరి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments:

Ennela said...

dEvuDi vishayalannee baagunnaayi..
andistunnanduku abhinandanalanDee