Thursday, September 16, 2010

మంత్రాలను బహిరంగంగా ఉపదేశించవచ్చా?

Thursday, September 16, 2010

 
 మంత్రాలు గురు ముఖంగా ఉపదేశింపబడాలంటారు, అదీ రహస్యంగా.  పైగా గురువు కొన్నాళ్ళు శిష్యులను పరీక్షించి వారు దానికి అర్హులు,  సరిగ్గా చెయ్యగలరు అని తెలిశాక ఇస్తారు అంటారు.  మరి ఈ మధ్య శాస్త్రవేత్తలు, ప్రముఖ గురువులు, అనేకమంది పెద్దలు మంత్రాలను బహిరంగంగా సభల్లోకూడా ఉపదేశిస్తున్నారు.  ఇలా చెయ్యవచ్చా అని చాలామందికి సందేహాలు వస్తున్నాయి.

మంత్రాలలో అనేక రకాలు.  వాటిని  కొన్ని వర్గాలుగా విభజించారు.  ఉదా... శాంతీకరణ మంత్రాలు, వశీకరణ మంత్రాలు, మోక్ష మంత్రాలు.  ఇందులో శాంతి మంత్రాలలో ఎక్కడా తీవ్రత వుండదు.  పొరపాటున ఉఛ్ఛారణ దోషాలొచ్చినా చేసేవారికి ఎలాంటి హానీ జరగదు.  సాధారణంగా ఇవి పెళ్ళి కావటం కోసం, ఆరోగ్యం కోసం ఇలా వుంటాయి.  పెళ్ళి కావటం కోసం జపం చేసే మంత్రం వల్ల అది చేసిన వాళ్ళకి లాభం వుంటుంది.  మిగతావారు వినటం వలన వీరికి కలిగే హాని ఏమీ లేదు.  ఒకవేళ ఇంకెవరికైనా కావాలన్నా వారుకూడా చేసుకోవచ్చు.  అలాగే ఆరోగ్యం కోసం చేసే మంత్రాలు బహిరంగంగా చెప్పటంవల్ల అందరికీ ఆరోగ్యం కలగాలని కోరుకోవటం జరుగుతుంది.  దీనిని విని కావాలసినవారు జపం చేసుకోవటంవల్ల వారందరికీ ఆరోగ్యం చేకూరుతుంది, దానివల్ల ఎవరికీ నష్టంలేకపోగా సమాజ శ్రేయస్సు జరుగుతుంది.  పైగా వీటిని బహిరంగంగా చెప్పటంవల్ల వీటి గురించి తెలియనివారుకూడా  తెలుసుకుని ఆచరించే అవకాశం వుంటుంది.  అందుకని ఇలాంటివాటిని బహిరంగంగా సభల్లో చెప్పటంవల్ల ఎవరికీ ఏ హానీ జరగదు, ఎలాంటి దోషం వుండదు పైగా ఎక్కువమందికి మంచి జరిగే అవకాశంవుంది.

కొన్ని మంత్రాలుంటాయి.  ఉదాహరణకి మోక్ష మంత్రం.  ఈ మంత్రం ఉపదేశించిన తర్వాత శిష్యుడు సరిగా చెయ్యకపోతే గురువుకి హాని జరుగుతుంది.  అందుకే గురువు శిష్యుని అనేక విధాల పరీక్షించిన తర్వాతే  ఉపదేశించబడతాయి,  అదీ బహిరంగంగా కాదు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


0 comments: