Tuesday, March 3, 2009

క్రికెట్ని దెబ్బ తీసిన ఆటంకవాదులు

Tuesday, March 3, 2009
క్రికెట్ ని దెబ్బ తీసిన ఆటంకవాదులు

పాకిస్తాన్ లోని లిబర్టీ స్క్వేర్ లో శ్రీలంక క్రికెట్ టీమ్ మీద ఉగ్రవాదుల కాల్పులు...7గురు శ్రీలంక ఆటగాళ్ళకి గాయాలు...ప్రమాదంలేదు. గాయపడినవారిలో జయవర్దనే, సంగక్కర, మెండిస్....అసిస్టెంట్ కోచ్ వున్నారు.

ఈరోజు (3-03-2009) ఉదయం 8-39 నుంచి 8-51 వరకి 12 నిముషాలపాటు జరిగిన కాల్పులలో ఆటంకవాదులు ఎ.కె. 47, రాకెట్ లాంచర్లు వాడారు. శ్రీలంక క్రికెట్ టీమ్ బస్ మీద గ్రెనేడ్ల్ విసిరారు. బస్లులోకి తుపాకీ తూటాలు చొచ్చుకు పోయాయి.

అరగంటసేపు ఉగ్రవాదులకు, పాకిస్తాను పోలీసులకు మధ్య జరిగిన పోరాటంలో 5 మంది పాకిస్తాను పోలీసులు చనిపోయారు. పోలీసులు స్టేడియం దగ్గర 2 కారు బాంబులను నిర్వీర్యం చేశారు. కాల్పులు జరిపిన వారుగా అనుమానిస్తున్న సలుగురు ఉగ్రవాదులను ఆయుధాలతో సహా పట్టుకున్నారు.

శ్రీలంక ఆటగాళ్ళని ఆర్మీ హెలికాప్టరులో పాకిస్తాన్ ఎయిర్ పోర్టుకి తరలించారు. అక్కడనుండి శ్రీలంకకి వెళ్ళబోతున్నారు. పాకిస్తానులో ఏ జట్టు పర్యటిచకపోయినా మేము ధైర్యంచేశామని రణతుంగ అన్నారు.

ఈ వార్త తెలియగానే శ్రీలంక తమ ఫారెన్ మినిస్టరుని పాకిస్తాను పంపించింది.

సెక్యూరిటీ లోపాలు లేవని చెప్తున్నారు. సెక్యీరిటీ ది బెస్ట్ అయితే అంతమంది ఆంటంకవాదులు అన్ని ఆయుధాలతో ఎలా జొరబడి కాల్పులు జరిపారో నాలాంటి సామాన్యులకు అర్ధం కాదు.
ఇండియా న్యూజీలాండ్ టీమ్స్ ముంజేతులకు నల్ల బ్యాడ్జ్ లు కట్టుకుని తమ నిరసన తెలియజేశారు.
ఒక దేశ ప్రతినిధులుగా క్రికెట్ ఆడటానికి వెళ్ళిన ఆటగాళ్ళు క్షతగాత్రులై అర్ధాంతరంగా తిరుగు ప్రయాణమవుతుంటే ఇంకే దేశవాసులన్నా ఏ ధైర్యంతో పాకిస్తాన్ వెళ్తారు

2 comments:

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

ఆటంకవాదులేంటండి ? తెలుగులో ఆటంకానికున్న అర్థం వేఱు. హిందీలో వేఱు. రెండూకలిపి కలగాపులగం చేస్తే ఎలా ?

psmlakshmiblogspotcom said...

తప్పును దిద్దినందుకు ధన్యవాదాలు బాల సుబ్రహ్మణ్యంగారూ.
psmlakshmi