Tuesday, October 20, 2009

Tuesday, October 20, 2009
కార్తీకమాస విశేషాలు

ఈరోజు జీతెలుగు లో గోపురం కార్యక్రమం ద్వారా తెలుసుకున్న విశేషాలు....
కార్తీకమాసంలో నదీ స్నానం ఎందుకు చెయ్యాలి?

ఆశ్వీయుజ, కార్తీక మాసాలలో యమకోరలు ఎక్కువగా వుంటాయి, ఈ మాసాలలో యముడు ఎక్కువగా తిరుగుతూ వుంటాడు. అంటే వాతావరణం లో మార్పుల కారణంగా ప్రజలలో జబ్బులు, తద్వారా మరణాలు ఎక్కువగా వుంటాయి. వీటిని నివారించటానికే ఈ ఆచారాల పేరుతో ఆరోగ్యాన్ని పెంపొందించే సాంప్రదాయాలు.

ఇంక నదీ స్నానం చెయ్యాలంటే నది దాకా నడవాలి. దానితో శారీరిక వ్యాయామం అవుతుంది. ప్రవహిచే నదులలో సహజంగా వుండే ఓషధులే కాకుండా నదీ పరీవాహక ప్రదేశాలలో వుండే ఓషధులను కూడా నదులు తమలో కలుపుకుని వస్తాయి. ఆ నీటిలో స్నానం చెయ్యటం ఆరోగ్యప్రదం. తెల్లవారుఝామున స్నానం చేసి నదిలో దీపాలు వదిలి పెడితే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా వుంటుందో వర్ణిచనలవికాదు. అలాంటి దృశ్యాలను చూసి, ఆసమయంలో భగవంతుని ధ్యానిస్తే మనసు ఎంత సంతోషంతో, ఉత్సాహంతో ఉప్పొంగిపోతుందో కదా.

ఆధ్యాత్మికంగా కూడా, ఈ నెలలో చేసిన నదీ స్నానాలు, పూజలు, దీపారాధనలు, దాన ధర్మాలు విశేష ఫలితాలనిస్తాయి. నది దగ్గర లేకపోతే, చెరువులోనో, కాలువ లోనో, అదీ లేకపోతే ఇంట్లో బావి దగ్గరో, అదీ లేకపోతే మన బాత్ రూమ్ లోనో స్నానం చేసి, వీలయితే గుడికి వెళ్ళి గుళ్ళో దీపం పెడితే మంచిది. స్నానం చేసే సమయంలో చెంబులో నీళ్ళని
కలుపుతూ

గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధూ కావేరి జలేస్మన్ సన్నిధిం కురు

అనే శ్లోకంతో ఆ సప్త నదులనీ మన చేతిలోవున్న నీటిలోకి ఆవాహన చేసుకుని ఆనీటితో స్నానం చెయ్యాలి.

0 comments: