Monday, June 21, 2010

బిడ్డ పుట్టిన తర్వాత జాతకం ఎప్పుడు వేయించాలి?

Monday, June 21, 2010



ఈ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం.  కొందరు అనేక అపోహలతో బిడ్డలకి 12 ఏళ్ళదాకా బాలారిష్టాలుంటాయి,  అందుకే 12 ఏళ్ళు దాటితేగానీ జాతకం వేయించకూడదంటారు.  కొందరు బిడ్డ పుట్టగానేనో, పురిటి స్నానం కాగానేనో,  లేదా వీలయినంత తొందరగా వేయిస్తారు. 

బిడ్డ పుట్టిన తర్వాత 12 సంవత్సరాల వరకూ బాలారిష్టాలుంటాయంటారు.  నిజమే.  మరి 12 సంవత్సరాలదాకా జాతకం వేయించకపోతే ఏమైనా గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు వుంటే శాంతులు ఎప్పుడు చేయిస్తారు.  అఫ్ కోర్స్ ఇవ్వన్నీ నమ్మకాలున్నవాళ్ళకేననుకోండి.  కొన్ని సార్లు జన్మ నక్షత్రం బాగా లేదని శాంతి చేయిస్తారు. 

అంతేకాదు.  బిడ్డకి 12 సంవత్సరాలు వచ్చేదాకా ఏ చెడ్డ పని చేసినా దాని బాధ్యత తల్లిదండ్రులదే.  అందుకే బిడ్డ పుట్టిన తర్వాత వీలయినంత త్వరలో జాతకం వేయిస్తే, ఏవైనా గ్రహ శాంతులు వగైరాలు అవసరమైతే చేయించవచ్చు.  అదీగాక జాతకం ప్రకారం బిడ్డ ఎలాంటి మనస్తత్వం కలవాడై వుంటాడో కూడా తెలుస్తుంది.  ఆ విషయాలు ముందు తెలుసుకోవటం ద్వారా ఆ బిడ్డని ఉత్తమ వ్యక్తిత్వం కల వ్యక్తిగా తీర్చి దిద్దటానికి తల్లిదండ్రులకి సహాయంగా వుంటాయి.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)



1 comments:

astrojoyd said...

kaadandi,biddaku modati 4 sum.lu talli chesina paapaalu aristaaniki karanam avutayi.4-8 years varaku,tandri paapaala valla aristaaluntaayi.ika 8 va sum.vat nunchi aa bidda poorva janmalo chesina paapaalu arista bhootamulu avutaayi ani saastra vachanam/jayadev.challa.-chennai-17