Thursday, February 11, 2010

క్షమించేవారు ఎక్కువ కాలం బ్రతుకుతారా?

Thursday, February 11, 2010



....క్షమయా ధరిత్రీ అన్నారు మనవాళ్ళు.  క్షమా గుణంలో భూ దేవి అంత గొప్పవారు వేరెవరూ లేరనీ, ఆవిడలాగా క్షమా గుణం నేర్చుకోవాలనీ అంటారు.  అయితే మనకి కష్టాలు కలిగించినవారిని క్షమించేసి నవ్వేసే గుణం అందరికీ వుండదు.  వారికి కలిగించిన కష్టానికి తగిన ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకుంటారు కొంతమంది...కొంతమంది క్షమించి వదిలేస్తారు.  అలా క్షమించి వదిలేయటంవల్ల  ఆత్మ తృప్తి వుంటుంది.  నేనెవరికీ అపకారం చెయ్యలేదు అనే స్ధిమితం వుంటుంది.   మనకు సంబంధించినవారూ ప్రశాంతంగా వుంటారు.  అనవసరమైన గొడవలు పెరగవు.  దానితో పరిస్ధితులు ప్రశాంతంగా వుంటాయి.   అలాగే క్షమింపబడ్డవాళ్ళు ఈ విషయంలో నేనేమీ తప్పు చెయ్యలేదుకదా అని తిరిగి ఆలోచించుకునే అవకాశం వస్తుంది.  వాళ్ళల్లో వాళ్ళు పశ్తాత్తాపపడే అవకాశం వస్తుంది. 

ఈ విషయంలో అమెరికాలో మిచిగన్ యూనివర్సిటీలో ఒక అధ్యయనం జరిగింది.  క్షమించే గుణం వున్న 1400 మనుషులమీద ఈ అధ్యయనం చేశారు.  మిగతా వారిలాగా ఈ క్షమా గుణం వున్నవారికి రోగాలు రాలేదుట.  మనస్సు, ఆత్మ ఎప్పుడూ ప్రశాంతంగా వుండటంవల్ల కొత్త రోగాలు రావు, వున్న రోగాలు అదుపులో వుంటాయి, దానితో ఆయుః ప్రమాణం పెరుగుతుంది అని తేల్చారు.  కోపంతో వూగి పోవటంవల్ల అన్నీ అదుపు తప్పటమేకాక వున్న రోగాలు పెరుగుతాయి, కొత్త రోగాలు వస్తాయి.  దానితో ఆయుః ప్రమాణం తగ్గుతుంది.  సైన్స్ అదే చెప్తోంది, శాస్త్రాలు అదే చెప్తున్నాయి, ఇప్పటి పరిశోధనలూ అదే చెప్తున్నాయి, డాక్టర్లుకూడా అదే చెప్తున్నారు..

సో, మనకి ఏది మంచిదో దానినే పాటించి సత్ఫలితాలు పొందటం ఇంక మన వంతు.

(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)


0 comments: