Saturday, February 13, 2010

ఇల్లు కట్టుకోవటానికి జ్యోతిష్యులను ఎప్పుడు సంప్రదించాలి?

Saturday, February 13, 2010



చాలామంది ఇల్లు దాదాపు పూర్తి అవుతున్న సమయంలో బరువులు ఏ వైపు పెట్టాలి, దేవుడిని ఎక్కడ పెట్టాలి, పొయ్యి గట్టు ఎక్కడ పెట్టాలి అని చిన్న చిన్న విషయాలకు సంప్రదిస్తారు.  ఇది సరియైన పధ్దతి కాదు. భూమి కొనే ముందే జ్యోతిష్యుడిని తీసుకెళ్ళి ఆ ప్రదేశం ఆ వ్యక్తి అక్కడ నివసించటానికి అనువుగా వున్నదా లేదా అని పరీక్ష చేయించాలి.  భూమి అడుగు పొరల్లో కొన్ని వేల సంపత్సరాలక్రింద భూమిలో కలిసిపోయిన ఇళ్ళు, దేవాలయాలు ఇలా ఎన్నో వుండవచ్చు.  జ్యోతిష్యుడు అక్కడ ప్రవేశించిన సమయాన్నిబట్టి లెక్కగట్టి ఆ స్ధలం కింద ఏమున్నాయో చెబుతారు.  ఈ విషయం జ్యోతిష్యులు తప్ప ఎవరూ చెప్పలేరు.  అంతకు ముందు ఆ ప్రదేశంలో వున్న ఇంట్లో హత్యలు, ఆత్మ హత్యలూ జరిగి  ప్రేతాలకి ఆలవాలమై వుండవచ్చు.  కొన్ని చోట్ల అంతకు ముందు శ్మశానాలు వున్న ప్రదేశాల్ని ఇప్పుడు ప్లాట్లు చేసి అమ్ముతుండవచ్చు.  భూమిలో పాతి పెట్టబడిన శవాల వల్ల కొన్ని చెడు వాయువులు తయారయి వుండవచ్చు.  శల్యాలు వుండి వుండవచ్చు.  అలాంటి ప్రదేశాలు నివాసయోగ్యంకాదు. అలాగే స్ధలం చతురస్రంగా కానీ, దీర్ఘ చతురస్రంగా కానీ వుండాలి.  కోణాలు లేకుండా వుండాలి.  వీటి గురించి శాస్త్రజ్ఞుణ్ణి సంప్రదించాలి. అందుకే సరైన వారిని సంప్రదించి తగిన స్ధలంలో ఇల్లు కట్టుకుంటే జీవితాంతం హాయిగా వుండవచ్చు.  


(జీ తెలుగు ప్రసారం చేసిన గోపురం ఆధారంగా)




0 comments: